ప్రజాసంకల్పయాత్ర 183వ రోజు షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 6 2018 8:47 PM

Prajasankalpayatra183th Day Scheduele Released  - Sakshi

సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నడిపల్లి కోట శివారు నుంచి 183వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కానూరు క్రాస్‌ రోడ్డు చేరుకున్న తరువాత ఆయన పాదయాత్ర ముగుస్తోంది.

ముగిసిన 182వ రోజు పాదయాత్ర  
వైఎస్‌ జగన్‌ 182వ రోజు పాదయాత్రను నడిపల్లి కోటలో ముగించారు. నేడు ఆయన పాదయాత్ర తణుకు శివారు నుంచి పాలంగి, ఉండ్రాజవరం, చిలకపాడు క్రాస్‌ రోడ్డు, మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట వరకు కొనసాగింది. వర్షం నిరంతరాయంగా కురువడంతో దాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా వైఎస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగించారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలివచ్చారు. గ్రామాలను దాటడానికి గంటల కొలదీ సమయం పట్టడంతో వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకోకుండా పాదయాత్రను కొనసాగించారు.

Advertisement
Advertisement